Sabarmati Express rail: సబర్మతి ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. యూపీలోని కాన్పూర్ వద్ద శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత 2.35 నిమిషాలకు ట్రైన్ పట్టాలు తప్పింది. ట్రాక్పై ఓ వస్తువును రైలు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
వారణాసి నుంచి అహ్మదాబాద్కు ఈ రైలు వెళ్తోంది. శనివారం తెల్లవారుజామున 02:35 గంటలకు కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పింది. ట్రాక్పై ఉంచిన వస్తువును ఇంజిన్ ఢీకొట్టి పట్టాలు తప్పింది.
రైల్వే ట్రాక్లో ఎలాంటి పగుళ్లు లేవని ప్రాథమిక విచారణలో తేలింది. ఐబీ, యూపీ పోలీసులు సంయుక్తం గా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపు ఆ రూట్లో వెళ్లే రైళ్లకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి.
ALSO READ: అటల్ సేతు బ్రిడ్జిపై మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన డ్రైవర్, పోలీసులు
ఏడాదిగా పరిశీలిస్తే ఈ మధ్యకాలంలో తరచూ రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వందలాది మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనల వెనుక కారణమెవరు? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం రైళ్ల ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు ప్రయాణికులు.
సబర్మతి ఎక్స్ప్రెస్కు ప్రమాదం
వారణాసి నుంచి అహ్మదాబాద్కు వెళ్తుండగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు.#SabarmatiExpress #TrainDerailed #Kanpur #NewsUpdates #Bigtv pic.twitter.com/4GcZQVBIDt
— BIG TV Breaking News (@bigtvtelugu) August 17, 2024