S JAI SHANKER : భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం పాకిస్తాన్ చేరుకున్నారు. అనంతరం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సదస్సుకు హాజరయ్యారు. ఈ మేరకు ఆయనకు నూర్ ఖాన్ ఎయిర్బేస్ వద్ద పాక్ సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే ఇస్లామాబాద్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తోనూ ఆయన భేటీ అయ్యారు.
ఇక సభ్యదేశాల అతిథుల గౌరవార్థం షరీఫ్ విందు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో నేతలు ఇద్దరూ పరస్పరం కరచాలనంతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
అయితే ఈ సదస్సు రెండు రోజుల పాటు పాకిస్థాన్ లోనే జరగనుంది. సభ్య దేశాల నుంచి ఈ సదస్సుకు అగ్రనేతలు హాజరయ్యారు. ఆర్థిక, వాణిజ్య, పర్యావరణ, సామాజిక-సాంస్కృతిక సంబంధాల్లో సభ్యదేశాల పరస్పర సహకారంపై చర్చలు జరపనున్నారు.
Also read : గాల్లో ఉండగానే దిల్లీ చికాగో విమానానికి బాంబు బెదిరింపు.. ఆ తర్వాత ఏం జరిగిదంటే ?