Road Accidents in Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఒకే రోజు రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో మెరెనా జిల్లాలో ట్రాక్టర్ను ట్రక్కు ఢీకొట్టడంతో ఇద్దరు కావడి యాత్రికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 14మందికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంతో ట్రాక్టర్ ను ఢీకొట్టాడు. దీంతో స్థానికులు ట్రక్కు డ్రైవర్ ను పట్టుకొని దాడి చేశారు. డ్రైవర్ వల్లే ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: సంగారెడ్డిలో కారును ఢీకొట్టిన ట్రక్కు..ఇద్దరు స్పాట్ డెడ్
ఇదిలా ఉండగా, ఈ ప్రమాదం జరిగిన మరో మూడు గంటల్లోనే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. భోపాల్ పట్టణంలో బైక్ ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.