6 School Students Died in Bus Accident in Haryana: హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. నర్నౌల్ జిల్లాలో స్కూల్ బస్ బోల్తా పడటంతో ఆరుగురు విద్యార్థులు చనిపోయారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారు.
ప్రమాదానికి గురైన బస్.. జీఎల్ పబ్లిక్ స్కూల్కు చెందినదిగా అధికారులు గుర్తించారు. కాగా ఈ రోజు రంజాన్ సెలవుదినం. సెలవుదినం రోజు స్కూల్ నడపటంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. 40 మంది విద్యార్థులతో ప్రయాణిస్తోన్న బస్ ఓవర్టేక్ చేసే క్రమంలో కంట్రోల్ తప్పడంతో పల్టీ కొట్టింది.
ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
VIDEO | Several children were injured when a school bus carrying them overturned in Haryana's #Narnaul earlier today. More details are awaited.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/mkaLfTAgpd
— Press Trust of India (@PTI_News) April 11, 2024