Road Accident: ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. కెంఝహార్ జిల్లా 20వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. బాలిజోడి వద్ద రోడ్డుపక్కన ఆగిఉన్న లారీని జీపు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
బాధితులంతా గంజాం జిల్లా నుంచి తారిణి దేవి ఆలయ దర్శనానికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. కాగా.. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.