Delhi: దేశరాజధాని ఢిల్లీలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కర్తవ్య పథ్లో జరిగిన ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్ సిసిలతో పాటు పలువురు హాజరయ్యారు. ముందుగా ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించి పరేడ్ను ప్రారంభించారు.
ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్ఫగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ వేడుకల సందర్భంగా రాజ్పథ్ మైదానంలో ఆర్మీ, నేవీ, వైమానిక దళం, పారా మిలటరీ దళాలు, పోలీసులు చేసిన కవాతు ఆకట్టుకుంది.