RamMandir Telecast | అయోధ్య రామమందిరంలో సోమవారం జరుగనున్న భగవాన్ శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అందరూ వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారాల ఏర్పాట్ల జరిగాయి. అయితే ఈ ప్రసారాలను తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
RamMandir Telecast | అయోధ్య రామమందిరంలో సోమవారం జరుగనున్న భగవాన్ శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అందరూ వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారాల ఏర్పాట్ల జరిగాయి. అయితే ఈ ప్రసారాలను తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
తమిళనాడు మీడియా ప్రచురించిన ఒక వార్తను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. రామ మందిర కార్యక్రమాలను ముఖ్యమంత్రి స్టాలిన్ బ్యాన్ చేయించారని పోస్ట్ పెట్టారు. తమిళనాడులోని హిందూ దేవలయాల్లో ఎవరైనా శ్రీ రాముడి పూజ కార్యక్రమాలు చేపడితే పోలీసులు వాటిని ధ్వంసం చేస్తామని హెచ్చరించినట్లు ఆమె చెప్పారు.
అయితే ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వ (The Hindu religious and Charitable Endowments department of Tamil Nadu) అధికారి పికె శేఖర్ బాబు స్పందించారు. తమిళనాడు ప్రభుత్వం హిందూ దేవాలయాలు, భక్తులపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. రాముడి పేరిట పూజలు, ప్రసాదాల పంపిణీపై ఎలాంటి నిషేధం తమిళనాడులో లేదని చెప్పారు.
అలాగే నిర్మాల సీతారమన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం చాలా దారుణమన్నారు. తమిళనాడు ప్రభుత్వంపై కావాలనే బిజేపీ పుకార్లను ప్రచారం చేస్తోందన్నారు.