Ayodhya Ram Mandir : అయోధ్యలోని రామమందిరంలోకి శ్రీరామ్లల్లా అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని లోపలికి తీసుకొచ్చారు. అంతకు ముందు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అధికారికంగా ప్రకటించింది.
అయోధ్య రామ మందిరంలో ఉండే రామ్ లల్లా విగ్రహాన్ని, మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. బ్లాక్ స్టోన్తో తయారుచేసిన ఈ విగ్రహ బరువు 150 నుంచి 200 కేజీల మధ్య ఉంటుంది.
శ్రీరామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న జరగనుంది. జనవరి 16 నుంచే ప్రాణప్రతిష్ఠ పూజలు ప్రారంభమయ్యాయి.ఈ నేపధ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయి.