EPAPER

Ayodhya: అయోధ్య రాముడికి 155 దేశాల నదీజలాలతో అభిషేకం.. ఎప్పుడంటే..?

Ayodhya: అయోధ్య రాముడికి 155 దేశాల నదీజలాలతో అభిషేకం.. ఎప్పుడంటే..?

Ayodhya: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో మహాక్రతువు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. శ్రీరాముడి విగ్రహానికి 155 దేశాల్లోని నదుల నుంచి సేకరించిన జలాలతో అభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ నెల 23న శ్రీరాముడికి జలాభిషేకం నిర్వహించనున్నారు. మణిరామ్‌ దాస్‌ చావ్నీ ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా పాల్గొంటారు. శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.


ఢిల్లీకి చెందిన రామభక్తుడు విజయ్‌ జొలీ నేతృత్వంలోని బృందం 155 దేశాల నుంచి తీసుకువచ్చిన జలాలను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు అందజేస్తారు. పాకిస్థాన్‌లోని రావి నది నుంచి కూడా జలాలు సేకరించారు. ఈ జలాలను పాక్‌లోని హిందువులు దుబాయ్‌కు పంపారు. అక్కడ నుంచి ఢిల్లీకి జలాలు చేరుకున్నాయని చంపత్ రాయ్‌ వివరించారు.


Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×