Rajput Karni Sena | రాజస్థాన్ రాజధాని జైపూర్ లో రాజ్పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ హింసాత్మక ఘటనలో సుఖ్ దేవ్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందారు.
సుఖ్దేవ్ సింగ్ ఇంటి బయట ఇద్దరు దుండగులు ఒక బైక్పై వచ్చి కాల్పులు చేశారు. ఈ ఘటనలో సుఖ్ దేవ్ సింగ్ తల, ఛాతీ భాగంలో బుల్లెట్లు తగలడంతో ఆయన ప్రాణాలు విడిచారు. కాగా కాల్పుల్లో మరో ఇద్దరకి గాయలయ్యాయి.
Sukhdev Singh Gogamedi | రాజస్థాన్ రాజధాని జైపూర్ లో రాజ్పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ హింసాత్మక ఘటనలో సుఖ్ దేవ్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందారు.
సుఖ్దేవ్ సింగ్ ఇంటి బయట ఇద్దరు దుండగులు ఒక బైక్పై వచ్చి కాల్పులు చేశారు. ఈ ఘటనలో సుఖ్ దేవ్ సింగ్ తల, ఛాతీ భాగంలో బుల్లెట్లు తగలడంతో ఆయన ప్రాణాలు విడిచారు. కాగా కాల్పుల్లో మరో ఇద్దరకి గాయలయ్యాయి.
కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకరికి తీవ్రగాయాలయ్యాయిని సమాచారం. అయితే ఆ ఇద్దరు దుండగులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు వారిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. నగరం సరిహద్దుల వద్ద తనఖీ చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి గజేంద్ర శెఖావత్ స్పందించారు. సుఖ్ దేవ్ మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
రాజ్ పుత్ కర్ణి సేన గురించి ఇంతకుముందు పద్మావత్ హిందీ సినిమా విడుదల సమయంలో దేశమంతా తెలిసింది. ఆ సినిమాని నిషేధించాలని.. లేకపోతే సినిమా నిర్మాత, దర్శకులను, నటులను చంపేస్తామని రాజ్ పుత్ కర్ణి సేన ప్రకటించి దేశమంతా సంచలనం రేపింది.