Rajasthan CM Bhajan Lal Sharma | రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ్ ఎన్నికయ్యారు. బిజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, బిజేపీ ఇతర సీనియర్ నాయకులు సరోజ్ పాండే, వినోద్ తావ్డే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. భజన్ లాల్ శర్మ సాంగనేర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ్ ఎన్నికయ్యారు. బిజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, బిజేపీ ఇతర సీనియర్ నాయకులు సరోజ్ పాండే, వినోద్ తావ్డే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. భజన్ లాల్ శర్మ సాంగనేర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిగా ఖరారు చేసే ముందు రాజస్థాన్ బిజేపీలో చాలా రాజకీయాలు నడిచాయని సమాచారం. ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందని సీరియస్ చర్చ నడిచింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మరోసారి సిఎం అయ్యేందుకు నూతనంగా గెలిచిన అందరు ఎమ్మెల్యేలకు డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఎమ్మెల్యేలందరినీ తనను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ఒప్పించడం కోసమే ఈ డిన్నర్ పార్టీ జరిగిందని తెలిసింది. ఈ విషయం తెలిసిన బిజేపీ ఢిల్లీ అధిష్ఠానం ఆమెను ఢిల్లీకి పిలిచింది.
దీంతో వసుంధర రాజే ఢిల్లీలో బిజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలిశారు. ఈ మీటింగ్ తరువాత వసుంధర రాజే ఒక్కసారిగా మాట మార్చారు. తాను బిజేపీ సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం ఎల్లప్పుడూ పనిచేస్తానని ఆమె వెల్లడించారు.
రాజస్థాన్ సిఎం రేసులో దియా కుమారి, రాజ్యవర్ధన్ రాఠోడ్, కిరోడి లాల్ మీణా, బాబా బాలక్ నాథ్ ఉన్నారు. వీరంతా సిఎం పదవి కోసం తెగ ప్రయత్నాలు చేసినా.. ఎవరికీ ఫలితం దక్కలేదు.