Rahul Gandhi: అసలే కశ్మీర్. అత్యంత సమస్యాత్మక ప్రాంతం. ఉగ్రవాదుల ముప్పు అధికం. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. అలాంటి సున్నితమైన రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. కాకపోతే, సెక్యూరిటీ ప్రాబ్లమ్ మరీ తీవ్రంగా ఉంది.
కశ్మీర్ పోలీసులు రాహుల్ గాంధీకి రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. రాహుల్ యాత్రలు జనంతో కిక్కిరిసి పోతున్నాయి. సెక్యూరిటీ జోన్ దాటుకొని మరీ జనం వచ్చేస్తున్నారు. నియంత్రించాల్సిన పోలీసులు కనిపించడం లేదు. ప్రజలను కంట్రోల్ చేయలేక సైడ్ అయిపోతున్నారు.
ఇలాగైతే కష్టమైని రాహుల్ కు రక్షణ కల్పిస్తున్న ఎస్పీజీ సిబ్బంది అభ్యంతరం చెబుతున్నారు. సెక్యూరిటీ సూచనతో.. ఇక చేసేది లేక అనంతనాగ్ లో తన యాత్రను ఇవాళ్టికి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు రాహుల్ గాంధీ. పోలీసులు రద్దీని నియంత్రిస్తేనే యాత్ర కొనసాగించొచ్చని చెప్పారు. మిగతా నేతలు పాదయాత్రను యధావిధిగా కొనసాగిస్తారని అన్నారు.