Kangana Ranaut comments on Rahul Gandhi(Telugu news live): బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సెబీ ఛైర్ పర్సన్ మాధవీ పురి బచ్పై హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు.
రాహుల్ గాంధీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. రాహుల్ గాంధీ ప్రధాని కాలేదనే నిరాశలో దేశ ఆర్థిక పరిస్థితిని అస్థిరపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హిండెన్ బర్గ్ నివేదికను ఆధారంగా చేసుకుని స్టాక్ మార్కెట్ గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. రాహుల్ దేశ ఆర్థిక పరిస్థితిని అస్థిర పరచడానికి చూస్తున్నారు. ప్రజలు ఆయనను ఎప్పటికీ గెలిపించరు.
రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండిపోతారంటూ కంగనా ఎక్స్ వేధికగా విమర్శించారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ కూడా మండిపడ్డారు. స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వాలని, ఎకానమీని ధ్వంసం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Rahul Gandhi is the most dangerous man, he is bitter, poisonous and destructive, his agenda is that if he can't be the Prime Minister then he might as well destroy this nation.
Hindenberg report targeting our stock market that Rahul Gandhi was endorsing last night has turned out… pic.twitter.com/DrsnLkOTRB— Kangana Ranautinn (@kanganaranautin) August 12, 2024