Punjab : పంజాబ్లోని తర్న్తరన్ జిల్లాలో పోలీస్స్టేషన్పై రాకెట్ దాడి కలకలం సృష్టించింది. దుండగులు ఏకంగా పోలీస్స్టేషన్పైనే రాకెట్తో నడిచే గ్రనేడ్తో దాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో పోలీస్స్టేషన్ బయటి పిల్లర్కు గ్రనేడ్ తగిలినట్లు అధికారులు గుర్తించారు. అయితే పిల్లర్కు గ్రనేడ్ తగిలిన తర్వాత అది ఎగరడంతో భారీ ప్రమాదం తప్పిందని తెలిపారు. రాకెట్ దాడిలో పోలీస్స్టేషన్ స్వల్పంగా ధ్వంసమయినట్లు అధికారులు తెలిపారు. అయితే దాడి ఘటనలో పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తమున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.