Puducherry Elephants : దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏనుగులకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు ఈ విషయంలో ముందంటాయి. అక్కడ చాలా ఆలయాలకు అవే దైవమార్గంగా కన్పిస్తుంటాయి. అలాంటి ఏనుగుల్లో ఒకటి చనిపోయింది. దీంతో దాని అంతిమయాత్రను ఘనంగా నిర్వహించారు. పుదుచ్చేరిలోని మనుకుల వినాయగర్ దేవాలయంలో చనిపోయిన ఏనుగు లక్ష్మికి…ఘన వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తుల పాల్గొన్నారు.