PT USHA : భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఇండియన్ దిగ్గజ అథ్లెట్, పరుగుల రాణి పీటీ.ఉష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా పీటీ ఉష గుర్తింపు పొందారు. ఎన్నికల్లో ఆమెకు పోటీగా వేరెవరు నామినేషన్లు వేయకపోవడంతో పీటీ ఉష ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. కాగా పీటీ.ఉష ప్రస్తుతం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జూనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్పర్సన్గా ఉన్నారు.