Price: ఏప్రిల్ 1. ఫైనాన్సియల్ మార్కెట్లో కీలకమైన తేదీ. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యేది ఆ రోజు నుంచే. బ్యాంకులు ఖాతల వెరిఫికేషన్తో బిజీగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అనేకం అప్పటినుంచే అమలవుతుంటాయి. ఇక, బడ్జెట్ ప్రతిపాదనలు వాస్తవ రూపం దాల్చేది కూడా ఏప్రిల్ 1 నుంచే.
ఇటీవలి యూనియన్ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అనేక వస్తువులపై పన్నులను సవరించింది. ఆ మేరకు పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. మరికొన్నిటి ధరలు తగ్గనున్నాయి. అవి ఏంటంటే…
ధరలు తగ్గేవి ఇవే..
–మొబైల్ ఫోన్లు
–మొబైల్ ఫోన్ ఛార్జర్లు
–టీవీలు
–భారత్లో తయారైన ఎలక్ట్రానిక్ వాహనాలు
–దుస్తులు
–వజ్రాలు, రంగు రాళ్లు
–బొమ్మలు
–సైకిళ్లు
–ఇంగువ, కాఫీ గింజలు
–కెమెరా లెన్స్లు
–లిథియం అయాన్ బ్యాటరీలు
–పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు
ధరలు పెరిగేవి ఇవే..
–సిగరెట్లు
–ప్లాస్టిక్ వస్తువులు
–దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు
–ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు
–బంగారు ఆభరణాలు, వెండివస్తువులు, ప్లాటినం
–ఇమిటేషన్ ఆభరణాలు
–ప్రైవేటు జెట్స్
–హెలికాప్టర్లు