Prajwal Revanna Send to Custody till June 2024: అత్యాచారం మరియు వేధింపుల కేసులకు సంబంధించి సస్పెండ్ అయిన జనతా దళ్(సెక్యులర్) నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణను కర్ణాటక కోర్టు జూన్ 24 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోమవారం ఉదయం స్పాట్ విచారణను పూర్తి చేసినందు వల్ల తదుపరి కస్టడీని కోరలేదు.
ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి పలు వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ ఏప్రిల్ లో దేశం విడిచి జర్మనీకి వెళ్లాడు. ప్రపంచంలోని అన్ని ఇమ్మిగ్రేషన్ పాయింట్ల వద్ద అతనిపై అనేక లుకౌట్ నోటీసులు జారీ చేయబడ్డాయి. మే 31న బెంగళూరుకు తిరిగి వచ్చిన ఆయనను సిట్ బృందం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన అనంతరం జూన్ 6 వరకు పోలీస్ కస్టడీకి పంపారు.
Also Read: అవన్నీ తప్పుడు వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సురేష్ గోపీ..
ఒక మహిళా ఐపీఎస్ అధికారి నేతృత్వంలో మొత్తం మహిళా పోలీసుల బృందాన్ని ప్రవణ్ణను అరెస్ట్ చేసేందుకు కర్ణాటక సిట్ లాంఛనప్రాయ సందేశం లాగా పంపించారు. ఈ క్రమంలో ఐదుగురు మహిళా పోలీసులు ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.