E-Paper
Advertisement

Himachal pradesh : హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న పోలింగ్..సెంటిమెంట్ పనిచేస్తుందా?

Himachal pradesh : హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న పోలింగ్..సెంటిమెంట్ పనిచేస్తుందా?

Himachal pradesh : హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. మొత్తం 68 నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 412 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. రాష్ట్రంలో 55, 92, 828 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల విధుల్లో 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చి హిమాచల్ ప్రదేశ్ లో కొత్త చరిత్ర సృష్టించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అధికార పక్షాన్ని ఓడించి విపక్ష పార్టీకి పట్టం కట్టే సంప్రదాయం ఈ రాష్ట్రంలో ఉంది. అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని కాంగ్రెస్ నమ్ముతోంది. మరోవైపు ఆమ్‌ఆద్మీ పార్టీ హిమాచల్ ప్రదేశ్ లో బరిలో ఉంది. ఆప్ ను ఏ మేరకు ప్రజలు ఆదరిస్తారో చూడాలి మరి.

హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఉత్సాహంగా ఓటేసి సరికొత్త చరిత్ర సృష్టించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రజలకు రాష్ట్ర పరిస్థితిపై అవగాహన ఉందని అందుకు తగ్గట్టుగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×