Rahul: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా శ్రీనగర్లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శ్రీనగర్లో కొందరు మహిళలు తనను కలిసి ఇప్పటికీ తాము లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నామని తనకు చెప్పినట్లు రాహుల్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై గతంలోనే రాహుల్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. లైంగిక వేధింపులు గురవుతున్న మహిళల వివరాలు అడిగారు. దీనిపై కాంగ్రెస్ స్పందించి తగిన సమయంలో వివరణ ఇస్తామని తెలిపింది. రోజులు గడుస్తున్నా కొద్దీ కాంగ్రెస్ నుంచి ఎటువంటి వివరణ రాకపోవడంతో పోలీసులు నేరుగా రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లారు.
స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీసులు సాగర్ ప్రీత్ హూడా నేతృత్వంలోని బృందం ఢిల్లీలోని తుగ్లక్ లేన్లో ఉన్న రాహుల్ ఇంటికి వెళ్లింది. లైంగిక దాడులు ఎదుర్కొంటున్నట్లు తనను సంప్రదించిన మహిళల వివరాలు చెప్పాలంటూ రాహుల్ను పోలీసులు ప్రశ్నించారు. వారి జాబితాను తమకు ఇవ్వాలని.. తద్వారా వారికి మరింత భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.