PM Modi: చంద్రయాన్ 3 సక్సెస్తో ప్రపంచంలో మన సత్తా ఏంటో చాటిచెప్పింది ఇస్రో. ఏ దేశం చేయని సాహసం చేసి జాబిల్లి దక్షిణ ధృవంపై కాలుమోపి భారత్ జెండాను రెపరెపలాడించింది. దీంతో దేశం మీసం మెలేసి.. ప్రపంచమే ఇండియా వైపు చూసేలా చేసింది శాస్త్రవేత్తల బృందం. సుసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసి అంతరిక్ష పరిశోధనల్లో మనకంటూ ఓ సువర్ణాధాయ్యాన్ని చరిత్రలో లిఖించేలా చేసిన ఇస్రో బృందాన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ.
చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. జాబిల్లి ముద్దాడే క్షణాన.. అంతా ఉత్కంఠతో ఉన్న సమయంలో అక్కడ నుంచే ఇస్రో టీంకు తన సపోర్టు అందించారు మోదీ. అయితే,.. ఆ పర్యటన ముగించుకుని గ్రీస్ నుంచి తిరిగి స్వదేశానికి చేరుకున్న ఆయన.. ఇస్రో శాస్త్రవేత్తలను బెంగుళూరులో కలిసి విష్ చేశారు. ప్రయోగానికి సంబంధించిన అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్లను గురించి అడిగి తెలుసుకున్నారు.
భారత్ శక్తి సామర్థ్యాలను ప్రపంచమంతా కీర్తిస్తోందన్నారు ప్రధాని మోదీ. అంతరిక్ష రంగంలోనే భారత్ ఓ చరిత్ర సృష్టించని.. ఇది మామూలు విజయం కాదన్న మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నానంటూ సైంటిస్టల బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి పీఎం నరేంద్రమోదీ పేరు పెట్టారు. ఆ ప్రాంతాన్ని శివశక్తిగా పిలుచుకుందాం అన్నారు. ఆగస్ట్ 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు.
ఇంటిపైనే కాదు.. చంద్రుడిపై కూడా త్రివర్ణ పతాకం ఎగురుతోందని ఆయన వ్యాఖ్యానించారు. జై విజ్ఞాన్, జై అనుసంధాన్ నినాదం ఇచ్చారు ప్రధాని మోదీ.