EPAPER

PM Modi AP Tour: ఈ రోజు ఏపీకి ప్రధాని.. సస్పెన్స్ లోనే ఒడిశా సీఎం ఎంపిక..?

PM Modi AP Tour: ఈ రోజు ఏపీకి ప్రధాని.. సస్పెన్స్ లోనే ఒడిశా సీఎం ఎంపిక..?

PM Modi to Attend Chandrababu’s CM Oath Ceremony Today: చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు సుమారు లక్షమంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు నాయుడు.. గన్నవరం ఎయిర్ పోర్టుకు సమీపంలోని కేసరపల్లి ఐటీపార్కు వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు కూటమి నేతలంతా చంద్రబాబునాయుడిని శాసనసభాపక్షనేతగా ఎన్నుకుంటారు. అనంతరం గవర్నర్ ను కలిసి కేబినెట్ జాబితాను అందజేసి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.


కాగా.. సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ విషయాన్ని పీఎంఓ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఉదయం ఢిల్లీ నుంచి స్టార్ట్ అయి.. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడలోని కేసరపల్లి ఐటీపార్కు వద్ద ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రానున్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారంలో పాల్గొని.. ఒడిశాకు బయల్దేరుతారు.

Also Read: చంద్రబాబు చెప్పిన పొలిటికల్ పాలన ఇదేనా?


గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భువనేశ్వర్ కు వెళ్తారు ప్రధాని. ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారం కూడా రేపే జరగనుంది. సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఆ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. దాదాపు పాతికేళ్ల తర్వాత.. ఒడిశాలో అధికారం మారింది. కానీ.. ముఖ్యమంత్రి ఎంపికపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ కు కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో.. ఆయనకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ లేదు. మరి ఎవరిని ఎంపిక చేయాలన్న బాధ్యతను కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ లకు అప్పగించింది బీజేపీ.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×