PM Modi : అయోధ్యలోని రామ మందిరానికి అంకితం చేసిన పోస్టల్ స్టాంపులను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా రాముడికి అంకితం చేసిన స్టాంపులతో కూడిన పుస్తకాన్ని ప్రధాని గురువారం విడుదల చేశారు.
స్టాంపుల ఆవిష్కరణ గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “ఈరోజు, శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ అభియాన్ నిర్వహించే మరో కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు లభించింది. ఈ రోజు, శ్రీరామ జన్మభూమి మందిర్పై 6 స్మారక పోస్టల్ స్టాంపులు, ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముడి స్టాంపుల ఆల్బమ్ విడుదలయ్యాయి. దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.” అని తెలిపారు.
ఈ 48 పేజీల స్టాంప్ బుక్ US, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా.. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలతో సహా 20 కంటే ఎక్కువ దేశాలు జారీ చేసిన స్టాంపులను కవర్ చేస్తుంది.