PM Modi : ఈ ఏడాది క్రీడా రంగంలో భారత అథ్లెట్లు సాధించిన విజయాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్లో ప్రధాని క్రీడా రంగం గురించి మాట్లాడుతూ.. భారత క్రీడాకారులపై ప్రశంసలు కురిపించారు. ఆసియా క్రీడలతోపాటు వివిధ టోర్నీలో భారత అథ్లెట్లు సత్తా చాటారని కొనియాడారు. ‘ఈ సంవత్సరం మన అథ్లెట్లు గొప్ప ప్రదర్శన చేశారన్నారు. ఆసియా గేమ్స్లో 107 పతకాలు గెలుచుకున్నారన్నారు. ఆసియన్ పారా గేమ్స్లో 111 మెడల్స్ సాధించారు.
PM Modi : ఈ ఏడాది క్రీడా రంగంలో భారత అథ్లెట్లు సాధించిన విజయాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్లో ప్రధాని క్రీడా రంగం గురించి మాట్లాడుతూ.. భారత క్రీడాకారులపై ప్రశంసలు కురిపించారు. ఆసియా క్రీడలతోపాటు వివిధ టోర్నీలో భారత అథ్లెట్లు సత్తా చాటారని కొనియాడారు. ఈ సంవత్సరం మన అథ్లెట్లు గొప్ప ప్రదర్శన చేశారన్నారు. ఆసియా గేమ్స్లో 107 పతకాలు గెలుచుకున్నారన్నారు. ఆసియన్ పారా గేమ్స్లో 111 మెడల్స్ సాధించారని పేర్కొన్నారు.
వన్డే వరల్డ్ కప్లో భారత క్రికెటర్ల ప్రదర్శన అందరి హృదయాలను గెలుచుకుందని మోడీ కొనియాడారు. మహిళల జట్టు అండర్-19 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవడం స్ఫూర్తిదాయకమన్నారు. ఇతర క్రీడల్లోనూ మన ఆటగాళ్లు సాధించిన విజయాలు దేశం కీర్తిని పెంచాయన్నారు. వచ్చే ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్లోనూ సత్తాచాటాలని ఆకాంక్షించారు. దేశం మొత్తం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు.