Pm Narendra Modi : ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు గురించి ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. గతిశక్తి ప్రాజెక్టు ద్వారానే వికసిత్ భారత్ లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకోగలమని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు.
విప్లవాత్మకమైన మార్పులకే గతిశక్తి..
మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకే గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేశామని మోదీ అన్నారు. ఫలితంగానే భారత్ అన్ని మౌలిక రంగాల్లో మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అభివృద్ధి చెందుతోందని చెప్పుకొచ్చారు. పలు ఆర్థిక ప్రణాళికలకు మల్టి-మోడల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్షర్ అందించేందుకే గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (PMGS-NMP)ను 2021, అక్టోబర్ 13న అమల్లోకి తీసుకువచ్చామన్నారు. మూడేళ్లు కింద ప్రారంభమైన దీని గురించి ప్రధాని మాట్లాడారు.
మల్టి మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ కోసమే…
దేశంలోని విమానాశ్రయాలు, రైల్వే, రోడ్లు, జలమార్గాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటి అభివృద్ధిలో గతిశక్తిదే కీలక పాత్ర అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకోవాలంటే అందుకు గతిశక్తి ఒక్కటే సాధానంగా ఉపయోగపడుతుందన్నారు. అంతేకాకుండా ఇది కొత్త ఆవిష్కరణలకు సైతం ఊతమిస్తుందన్నారు.
Also Read : సీఎం అభ్యర్థిపై ఉద్ధవ్ ఠాక్రే చురకలు… అధికారంలో ఉండి మమ్మల్నే చెప్పమంటే ఎట్లా