PM Modi Instructed to Remove ‘Modi Ka Parivar Tags’: సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ నేతల సోషల్ మీడియా ప్రొఫైల్స్లో వారి పేర్ల ప్రక్కన మోదీ కా పరివార్ ట్యాగ్ దర్శనమిచ్చింది. అయితే మోదీ ఒంటరి అన్న రాజకీయ ప్రత్యర్థుల వ్యాఖ్యలకు కౌంటర్గా బీజేపీ నేతలు తామంతా మోదీ కుటుంబమే అని చెప్పుకోవడానికి మోదీ కా పరివార్ ట్యాగ్ పెట్టుకున్నారు. అయితే దీనిపై ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న ప్రధాని మంగళవారం వారికి కీలక సూచన చేశారు.
మోదీ కా పరివార్ ట్యాగ్లను సోషల్ మీడియా ప్రొఫైల్స్ నుంచి తొలగించాలని ప్రధాని మోదీ బీజేపీ నేతలకు తెలిపారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో మోదీకి కుటుంబం లేదని విమర్శించారు. దీంతో ఈ విమర్శల తర్వాత బీజేపీ నేతలు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో వారి పేరు తర్వాత మోదీ కా పరివార్ అంటూ ట్యాగ్లు పెట్టుకున్నారు. అయితే వాటిని తీసివేయాలంటూ బీజేపీ నేతలను మోదీ కోరారు.
ఎక్స్ లో ప్రధాని మోదీ భారత దేశం అంతటా ప్రజలు ఎన్నికల ప్రచారం తర్వాత తనపట్ల ఉన్న అభిమానానికి గుర్తుగా తమ సోషల్ మీడియాలో మోదీ కా పరివార్ అని చేర్చుకున్నారని.. భారత ప్రజలు వరుసగా ఎన్డీఏకు మూడోసారి మెజారిటీని అందించారని.. ఇది ఒక రికార్డు అని, దేశ అభ్యన్నతి కోసం నిరంతరం పని చేయాలని ఆదేశాలు ఇచ్చారని మోదీ పేర్కొన్నారు.
Also Read: ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన.. ఎక్కడికంటే ?
Through the election campaign, people across India added 'Modi Ka Parivar' to their social media as a mark of affection towards me. I derived a lot of strength from it. The people of India have given the NDA a majority for the third consecutive time, a record of sorts, and have…
— Narendra Modi (@narendramodi) June 11, 2024