EPAPER

PM Modi Gujarat Tour Highlights: దేశంలో పొడవైన కేబుల్ బ్రిడ్జ్.. సుదర్శన్ సేతును ప్రారంభించిన మోదీ..

PM Modi Gujarat Tour Highlights: దేశంలో పొడవైన కేబుల్ బ్రిడ్జ్.. సుదర్శన్ సేతును ప్రారంభించిన మోదీ..

PM Modi inaugurates India's longest cable-stayed Sudarshan Setu bridge in Dwarka


PM Modi Gujarat Tour Highlights : ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఈ తీగల వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జి పొడవు 2.3 కిలోమీటర్లు. ఈ వంతెన నిర్మాణానికి 979 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

Read More: రైతులకు కేంద్రం శుభవార్త.. అకౌంట్‌లో డబ్బులు పడేది ఆ రోజే..


దేశంలోనే అతిపొడవైన ఈ కేబుల్ బ్రిడ్జ్ కు సుదర్శన్ సేతు అని నామకరణం చేశారు. ఈ వంతెన నిర్మాణంతో ఓఖా ప్రాంతం.. బెట్ ద్వారకా తో అనుసంధానమైంది. 2017 అక్టోబర్ లో ప్రధాని మోదీ సుదర్శన్ సేతు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

4 వరుసలతో ఈ వంతెనను నిర్మించారు. బ్రిడ్జ్ వెడల్పు 27.20 మీటర్లు. ఇందులోనే ఫుట్‌పాత్‌ ను ఏర్పాటు చేశారు. పుట్ పాత్ వెడల్పు 2.5 మీటర్లు. వంతెనకు ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు పొందుపర్చారు. బ్రిడ్జిపై సోలార్‌ ప్యానళ్లు అమర్చారు. దీని ద్వారా మెగావాట్‌ విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు.

ప్రధాని గుజరాత్ పర్యటనలో ద్వారక ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా 5 ఎయిమ్స్ హాస్పిటళ్లను ప్రారంభించారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్ కూడా ఉంది.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×