PM Modi UP Tour Live Updates(Telugu news headlines today): ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. సంభాల్ జిల్లాలో శ్రీకల్కి ధామ్ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీకల్కీ ధామ్ టెంపుల్ నమూనాను ఆవిష్కరించారు. అనంతర సభలో ప్రసంగించారు.
ఈ ఆలయాన్ని శ్రీకల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ నిర్మిస్తోంది. ఈ ట్రస్టుకు ఛైర్మన్ గా ఆచార్య ప్రమోద్ కృష్ణం వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, శ్రీకల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ ఛైర్మన్ ఆచార్య ప్రమోద్ కృష్ణం పాల్గొన్నారు. భారీగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో పలువురు సాధువులు, మత పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు.
Read More: మధ్యప్రదేశ్లో 500 గోవులమృతి !
ప్రజల స్ఫూర్తితో మరో పవిత్ర స్థలానికి శంకుస్థాపన జరిగిందని ప్రధాని మోదీ అన్నారు. ఆచార్యులు, సాధువుల సమక్షంలో గొప్ప కల్కి ధామ్కు శంకుస్థాపన చేసే అదృష్టం తన లభించిందన్నారు. భారతీయ విశ్వాసానికి కల్కీ ధామ్ మరో గొప్ప కేంద్రంగా అవతరిస్తుందని నమ్మకం ఉందని తెలిపారు.
అలాగే గ్రౌండ్ బ్రేకింగ్ 4వ ఎడిషన్ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఎం మాట్లాడుతు.. గడిచిన 7ఏళ్లలో అద్భతంగా యూపీ అభివృద్ధి చెందిందన్నారు. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. దేశంలోని అభివృద్ధపై విదేశాల్లో చర్చలు జరుగుతున్నాయి అని వెల్లడించారు.