PM Modi : అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఉపవాసాన్ని విరమించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ప మోదీకి ‘చరణామృత్’ అంటే
పూజ కోసం వినియోగించిన పాలతో చేసిన పానీయాన్ని ఇచ్చారు. ప్రత్యేక అనుష్ఠానం పాటించినందుకు అభినందించారు.
PM Modi : అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఉపవాసాన్ని విరమించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ప్రధాని మోదీకి ‘చరణామృత్’ అంటే
పూజ కోసం వినియోగించిన పాలతో చేసిన పానీయాన్ని ఇచ్చారు. ప్రత్యేక అనుష్ఠానం పాటించినందుకు అభినందించారు.
రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు కోసం 11 రోజుల నుంచి మోదీ ఉపవాసం పాటించారు. ఈ విషయాన్ని మోదీ జనవరి 12న వెల్లడించారు. ఆ రోజు ఉపవాసంపై యూట్యూబ్ ఛానల్లో సందేశం పెట్టారు. అయోధ్యలో చారిత్రక ఘట్టానికి సాక్షిగా ఉండటం తన అదృష్టమని తెలిపారు. ఈ మహాక్రతువులో ప్రజల పక్షాన ప్రాతినిధ్యం వహించే అదృష్టం దేవుడు తనకిచ్చాడని పేర్కొన్నారు. నేటి నుంచి ప్రత్యేక అనుష్ఠానం పాటిస్తున్నానని జనవరి 12న వివరించారు.
మోదీ 11 రోజులపాటు కేవలం దుప్పటి మాత్రమే నేలపై పరుచుకుని నిద్రించారు. కొబ్బరినీళ్లు మాత్రమే తాగారు. అనుష్ఠానం నియమాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్ర లేచారు. యోగా, ధ్యానం చేశారు. ఇలా కఠిన నియమాలు ఆచరించారు.