Pent house: సొంతిళ్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. అద్దెకు ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా.. చిన్న రూమ్ అయినా సొంతంగా ఉంటే బాగుండు అని అందరూ అనుకుంటారు. ఇక ఈ రోజుల్లో సొంతిళ్లు కట్టుకోవడం అంటే మాటలతో అయ్యే పని కాదు. కట్టలు కట్టలు డబ్బు కుమ్మరించాల్సిందే. హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి అభివృద్ధి చెందిన నగరాల్లో సొంత ఇళ్లు కట్టుకోవాలంటే మినిమం కోటి రూపాయలు పెట్టాల్సిందే.
ఇటీవల ముంబైలోని వర్లీ ప్రాంతంలో డాక్టర్ అనిబిసెంట్ రోడ్డులో ఉన్న ఓ అపార్ట్మెంట్లోని పెంట్ హౌస్ వందల కోట్లకు అమ్ముడుపోయింది. సహానా గ్రూప్ అనే సంస్థ ఆ అపార్ట్మెంట్ను నిర్మించింది. 29 వేల 885 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత లగ్జరీగా ట్రిపుల్ బెడ్రూమ్ పెంట్ హౌస్ను నిర్మించింది. దానిని వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బికె గోయెంకా రూ. 230.55 కోట్లకు కొనుగోలు చేశారు.
ముంబైలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం.. బీట్ వ్యూ వంటి కారణాలతో ఆ ఫ్లాట్ అంత ధరకు అమ్ముడుపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఇక భారత్లో అన్ని కోట్లు పెట్టి పెంట్ హౌస్ కొనుగోలు చేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఇటీవలే ఆ అపార్ట్మెంట్లో డిమార్ట్ సంస్థ అధినేత రాధాకిషన్ దమానీ కూడా రూ.1238 కోట్లు పెట్టి ఏకంగా 28 ఫ్లాట్లను కొనుగోలు చేశారట.