EPAPER
Kirrak Couples Episode 1

Parliament : పార్లమెంటులో ఉగ్రదాడికి 21 ఏళ్లు..

Parliament : పార్లమెంటులో ఉగ్రదాడికి 21 ఏళ్లు..

Parliament : భారత పార్లమెంట్​పై జరిగిన ఉగ్రదాడికి 21 ఏళ్లు అయిన నేపథ్యంలో అప్పటి ఘటనలో మరణించిన భద్రతా సిబ్బందిని స్మరించుకున్నారు పలువురు ప్రముఖులు. పార్లమెంట్ ఆవరణలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేత మల్లిఖార్జునఖర్గే, సోనియాగాంధీ నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. వారు చేసిన త్యాగానికి దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందని అన్నారు. ఆ ఘటనలో మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.


లష్కరే తొయిబా ఉగ్రసంస్థకు చెందిన ఐదుగురు సాయుధులు 2001 డిసెంబర్ 13న పార్లమెంట్​పై దాడి చేశారు. పార్లమెంట్ కాంప్లెక్స్​లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు చేశారు. ఇందులో ఓ పౌరుడు, భద్రతా సిబ్బంది సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో పార్లమెంట్​లో 100 మంది సభ్యులు ఉన్నారు.


Tags

Related News

Drivers cheated: వెలుగులోకి కొత్త రకం దొంగతనం.. ప్రమాదమని చెప్పి..!

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Onion prices: ఆకాశన్నంటిన ఉల్లి ధరలు.. మరింత పెరగనున్నట్లు అంచనా!

Arunachal Pradesh: దారుణం.. 21 మంది స్కూల్ విద్యార్థులపై లైంగిక దాడి.. హాస్టల్ వార్డెన్‌కు ఉరిశిక్ష

YS Jagan: టెన్షన్ టెన్షన్.. తిరుమలకు జగన్.. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30!

Big Stories

×