EPAPER

PM Narendra Modi:ప్రధాని మోదీకి పాకిస్తాన్ ప్రత్యేక ఆహ్వానం..ఎందుకో తెలుసా?

PM Narendra Modi:ప్రధాని మోదీకి పాకిస్తాన్ ప్రత్యేక ఆహ్వానం..ఎందుకో తెలుసా?

Pakistan Invites PM Modi to Attend SCO Meeting: భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ రావాల్సిందిగా ఆహ్వానం అందింది. ప్రతిష్టాత్మక ‘షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్’ అత్యున్నత భేటీని పాకిస్తాన్ ఈ ఏడాది అక్టోబర్ 15, 16 తేదీలలో నిర్వహించనుంది.


రాజధాని ఇస్లామాబాద్ ఈ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి ఎస్‌సీఓలో సభ్యత్వం ఉన్న దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు లేదా విదేశాంగ శాఖ మంత్రులు హాజరవుతారు.

ఈ ఆర్గనైజేషన్ 2001లో ఏర్పాటైంది. ఇందులో భారత్, చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్జెకిస్తాన్ దేశాలకు సభ్యత్వం ఉంది. అఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా, అబ్జర్వర్, స్టేట్స్ హోదాలో కొనసాగుతున్నాయి.


అలాగే, ఆర్మేనియా, అజర్ బైజాన్, కాంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీలకు డైలాగ్ పార్ట్‌నర్‌షిప్ ఉంది. ఈ సమ్మిట్ లో సభ్యదేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనేది ముఖ్య ఉద్ధేశం.

గతేడాది ఈ సమ్మిట్ ను భారత్‌లోని గోవాలో నిర్వహించింది. ఈ ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ అధికారికంగా ఆహ్వాన పత్రాలను పంపించింది.

Also Read:  ‘చెప్పుతో కొట్టు’.. శివాజీ విగ్రహ వివాదంపై మహారాష్ట్రలో వింత నిరసన

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×