Diwali Bonus : తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరి పట్టణంలో ఉన్న ఒక టీ ఎస్టేట్ యజమాని పి శివకుమార్ తన ఉద్యోగులకు దీపావళి బోనస్గా రూ.2 లక్షలకు పైగా విలువైన బైక్లను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. టీ ఎస్టేట్లో గత రెండు దశాబ్దాలుగా 627 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. శివకుమార్.. తన మేనేజర్, సూపర్వైజర్, స్టోర్ కీపర్, క్యాషియర్, ఫీల్డ్ స్టాఫ్, డ్రైవర్లతో సహా 15 మంది ఉద్యోగులకు బైక్లను బహుమతిగా ఇచ్చాడు.
కొత్త బైక్ల తాళాలు ఉద్యోగులకు అందజేసి వారితో కలిసి శివకుమార్ రైడ్కి కూడా వెళ్లాడు. ఎస్టేట్ యజమాని తమకు 15 రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను బహుమతిగా ఇచ్చాడని ఓ ఉద్యోగి తెలిపాడు. తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చేర్పించాలని కోరుకునే కార్మికుల కోసం ఎస్టేట్ సమీపంలోని నేడుగుల పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను ఎస్టేట్ యాజమాన్యం నియమించింది. గతంలో మూతపడే దశలో ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 320 మంది విద్యార్థులు ఉండగా, అందులో 80 మంది ఎస్టేట్కు చెందిన వారే కావడం గమనార్హం. అంతేకాకుండా, శివకుమార్ కార్మికులకు ఉచితంగా మందులు అందజేసే ఫార్మసీని కూడా నడుపుతున్నాడు.