Omicron India : భారత్లో భయానకమైన కోవిడ్ పరిస్థితులు వచ్చే అవకాశం లేదని, కాబట్టి అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని దేశంలోని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ పరిస్థితులు కూడా రాకపోవచ్చని అన్నారు. భారతీయుల్లో హైబ్రిడ్ ఇమ్యునిటీ పెరిగింది గనుక గతంలోలాగా తీవ్ర పరిణామాలు ఎదురుకాకపోవచ్చని అన్నారు.
ఏయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్. రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్లో కోవిడ్ కేసులు అదుపులోనే ఉన్నాయి కాబట్టి అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు.భారతీయుల్లో గత రెండు సంవత్సరాల నుంచి తీసుకున్న వ్యాక్సిన్ల వల్ల ఇంకా ఇప్పటికే కోవిడ్ను ఎదుర్కొనడం వల్ల హైబ్రిడ్ ఇమ్యునిటీ పెరిగిందన్నారు.
చైనాలో బిఎఫ్ 7 విజృంభించినట్లు ఇండియాలో కూడా వ్యాపిస్తుందని భయాందోలనకు గురికానవసం లేదన్నారు. భారత్లో ఇప్పటికే బిఎఫ్7 వేరియంట్ ఎంటర్ అయిందని.. కానీ ఇక్కడ చైనా పరిస్థితి రాదన్నారు. భారతీయులు తీసుకున్న వ్యాక్సిన్లతో పోలిస్తే..చైనా వ్యాక్సిన్లు బలహీనమైనవి అని అన్నారు డాక్టర్ రణదీప్ గులేరియా.