Odisha Train Accident : రోడ్డు, రైలు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోడ్డుపైన లేని సామాన్యుల జనాలపైకీ దూసుకెళ్లి వాహనాలు ప్రాణాలు తీసున్నాయి. బిహార్లో ప్రజలమీదకి దూసుకెళ్లిన లారీ దుర్ఘటన మరువక ముందే ఒడిశాలో గూడ్స్ రైలు..ప్లాట్ఫారమ్ మీదున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘోరప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు.
ఒడిశా జాజ్పూర్ జిల్లా కొరాయి రైల్వేస్టేషన్లో ఈ ఘోరరైలు ప్రమాదం జరిగింది. ఆ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారంపై రైలు కోసం వేచిచూస్తున్నారు ప్రయాణికులు..అప్పుడే ఓ గూడ్స్ రైలు ప్లాట్ఫార్మ్ మీదున్నవారిపైకి దూసుకెళ్లింది. 10 భోగీలు చెల్లాచెదురయ్యాయి.. ఇద్దరు ప్రయాణికులు ఆ భోగీల కింద చిక్కుకొని మృతి చెందగా అనేక మందికి తీవ్రగాయాలలయ్యాయి.