EPAPER

Nirmala Sitharaman: వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరోమంత్రిగా.. నిర్మలమ్మ

Nirmala Sitharaman: వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరోమంత్రిగా.. నిర్మలమ్మ

Nirmala Sitharaman: 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నిర్మలా సీతారమన్ వరుసగా బడ్జెట్ ప్రవేశపెడుతూ వస్తున్నారు. ఈక్రమంలో వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరో ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ నిలిచారు. అంతకంటే ముందు అరుణ్ జైట్లీ, యశ్వంత్ సిన్హా, పి.చిదంబరం, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ వరుసగా ఐదు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.


దేశ చరిత్రలోనే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా.. 1959-60 నుంచి 1963-64 మధ్యలో వరుసగా ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ఆ తర్వాత మన్మోహన్ సింగ్ 1991-92 నుంచి 1995-96 వరకు ఐదు పద్దులు పార్లమెంట్ ముందు ఉంచారు. ఇక 1998-99 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన యశ్వంత్ సిన్హా.. 1999-2000 నుంచి 2002-03 వరకు వరుసగా నాలుగుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.


పి.చిదంబరం 2004-2005 నుంచి 2008-2009 వరకు ఐదుసార్లు బడ్జెట్‌ను పార్లమెంట్ ముందు ఉంచారు. ఇక మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా 2014-15 నుంచి 2018-19 వరకు వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ను పార్లమెంట్ ముందుంచారు.

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×