NIA Raids : దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఐసీస్ భారీ కుట్ర చేసింది. దేశంలోని కర్ణాటక,మహారాష్ట్ర, జార్ఖండ్, ఢీల్లీ మొదలైన ప్రాంతాలలో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తొమ్మిది బృందాలు విభిన్న ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. బళ్లారిలో ఉన్న కౌలబజార్, జగతినగర్ తొమ్మిది ప్రాంతాలలో ఆకస్మీక తనిఖీలు నిర్వహించారు. NIA బృందాలకు ప్రత్యేకంగా పోలీసులు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది.
ఇదిలా ఉండగా.. డిసెంబర్ నెలలో 19 ఏళ్ళ యువకుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ.. నకీలు నోట్ల తయారీ చేస్తున్న వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంది. దేశ ద్రోహం, మత్తుపదార్ధాలు రవాణా తో సంబంధం ఉన్న పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు.