NIA Raids : ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి 3 కేసుల్లో ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, చండీగఢ్, రాజస్థాన్, యూపీలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది ఎన్ఐఏ.
ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఉగ్ర కార్యకలాపాలపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. బబ్బర్ ఖల్సా అనే ఉగ్రవాద సంస్థ.. ఉగ్రవాదులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తోంది. ఈ సోదాల్లో భాగంగా రెండు తుపాకులు, 2 మ్యాగజీన్లు, పేలుడు పదార్థాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.