Centre to create 5 new districts in Ladakh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ విజన్ ప్రకారం..లడఖ్ అభివృద్ధి, శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఐదు జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ప్రస్తుతం రెండు జిల్లాలు లేహ్, కార్గిల్ ఉండగా..అదనంగా మరో ఐదు జిల్లాలు నూతనంగా ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కొత్త జిల్లాల పేర్లను జన్స్కర్, డ్రాస్, శామ్, నుబ్రా, చంగ్థంగ్గా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందుతాయని తెలిపారు. లడఖ్ ప్రజలకు సమృద్ధిగా అవకాశాలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా తెలిపారు.
Also Read: జమ్మూకశ్మీర్లో ఎలక్షన్స్..బీజేపీ అభ్యర్థుల జాబితా రిలీజ్
జమ్మూకశ్మీర్లో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1 వరకు మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా కొత్త జిల్లాల ప్రకటన చర్చనీయాంశంగా మారింది.