NDA CM’s Conclave Meeting : హరియాణా రాజధాని చండీగఢ్’లో ఇవాళ ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉఫ ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
తొలి సమావేశం…
ఇక హరియాణా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏర్పాటైన తొలి ఎన్డీఏ కూటమి సమావేశం ఇదే కావడం గమనార్హం.
17 సీఎంలు, 18 డీసీఎంలు…
మొత్తం 17 రాష్ట్రాల సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరైన ఈ సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత్ అభివృద్ధికి తమ కూటమి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. పేదలు, అణగారిన వర్గాలకు అన్ని రంగాల్లో సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి పక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. భేటీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే, గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జెపి నడ్డా హాజరయ్యారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. అనంతరం వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
Also Read : దక్షిణాదిలో కాంగ్రెస్ జెండాను నిలబెట్టేది ఎవరు, వయనాడ్’పై హైకమాండ్ స్పెషల్ ఫోకస్