NCP: మహారాష్ట్ర ఎన్సీపీలో చీలక వచ్చింది. శరద్ పవార్ కు షాక్ తగిలింది. ఆయన తన కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను ఇటీవల పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు.
శరద్ పవార్ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాన్ని ప్రకటన చేసిన రోజే మీడియా ముందు అజిత్ పవార్ ముఖం చాటేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి షిండే వర్గం పావులు కదిపింది. అజిత్ పవార్ తో సంప్రదింపులు జరిపింది. ఈ చర్చలు ఫలించాయి. ఫలితంగానే ఎన్సీపీలో చీలిక వచ్చింది.
అంతకుముందు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారితో చేతులు కలిపిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.ఛగన్ భుజ్ బల్ మంత్రికి ప్రమాణం చేశారు. అజిత్ పవార్ కు ఆర్థికశాఖ ఇచ్చే అవకాశం ఉంది.