Narendra Modi : అమృత కాల సమయంలో సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకున్న భారత్ను.. సరైన దిశలో నడపాల్సిందిగా ఉపరాష్ట్రపతిని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. రాజ్యసభ ఛైర్మన్ హోదాలో తొలిసారి సమావేశాలు నిర్వహిస్తున్న జగదీప్ ధన్ఖడ్కు మోదీ సాదర స్వాగతం పలికారు.
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ బాధ్యతలను భారత్ భుజాలకెత్తుకుందని.. దీన్ని సమర్థవంతంగా నిర్వహించే దిశగా దేశవాసులను ఉపరాష్ట్రపతి నడిపిస్తారని మోదీ ఆకాంక్షించారు. దేశంలో ఎంతో మందికి ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. అనేక బాధ్యతలను ధన్ఖడ్ సమర్థంగా నిర్వర్తించారని.. రైతుబిడ్డ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం సంతోషించదగ్గ విషయమన్నారు మోదీ