Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. సాయంత్రం 5:15 గంటలకు, గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. విద్యుద్దీపాల వెలుగులో విమానాశ్రయం మెరిసిపోతోంది.
అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే నాగ్పూర్-షిర్డీలను కలుపుతూ 520 కిలో మీటర్ల దూరాన్ని కవర్ చేసే సమృద్ధి మహామార్గ్ ఫేజ్-1ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. నాగ్పూర్-ముంబై సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్ప్రెస్వే ప్రాజెక్ట్, దేశవ్యాప్తంగా మెరుగైన కనెక్టివిటీ-ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దృష్టి సారించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.