Nagpur Blast : మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈరోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. ఉదయం బజార్ గావ్లోని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ఈ ఘోరం జరిగింది. కంపెనీలోని క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ లో ప్యాకింగ్ సమయంలో సడెన్ గా భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది కార్మికులు స్పాట్ లోనే చనిపోయారు. మరికొంతమంది కార్మికులకు గాయాలయ్యాయి.
పేలుడు సమాచారం అందగానే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్లు వెంటనే కంపెనీ వద్దకు చేరుకున్నాయి. గాయపడిన కార్మికులను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగిందనే వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో మొత్తం 12 మంది ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు.
కాస్ట్ బూస్టర్ ప్లాంట్లో ప్యాకింగ్ చేస్తుండగా.. కెమికల్ లిక్విడ్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించి చుట్టుపక్కలున్న కార్మికులు చెల్లాచెదురయ్యారు. ఈ కంపెనీ పేలుడు పదార్థాలు, రక్షణశాఖకు కావాల్సిన పరికరాలను తయారు చేస్తోందని తెలుస్తోంది.