EPAPER

Mumbai: విషాదం.. క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి..

Mumbai: విషాదం.. క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి..
Mumbai news today

Mumbai news today(Today news paper telugu):

మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ మ్యాచ్ ఆడుతూ.. 52 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అందుకు కారణం.. పక్కనే జరుగుతున్న మ్యాచ్ లో బాల్ వచ్చి అతని తలకు బలంగా తగలడమే. మాతుంగాలోని మైదాన్ లో ఈ ఘటన జరిగింది. గాయమైన వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందిన వైద్యులు నిర్థారించినట్లు తోటి ఆటగాళ్లు తెలిపారు. అక్కడే ఉన్న మిగతా ఆటగాళ్లు తెలిపిన వివరాల ప్రకారం.. 50కి పైగా వయసున్న వ్యక్తుల కోసం.. కుచ్చివీసా ఓస్వాల్ వికాస్ లెజెండ్ కప్ పేరిట ముంబైలో టీ20 టోర్నమెంట్ జరుగుతోంది.


టోర్నమెంట్ లో భాగంగా సోమవారం 2 మ్యాచ్ లను పక్కపక్క పిచ్ లపై నిర్వహించారు. సమయం ఎక్కువగా లేకపోవడం, ఇతర మైదానాలు అందుబాటులో లేకపోవడంతో ఇలాగే చేయాల్సి వచ్చింది. కానీ.. ఇందులో బాల్ తగిలి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఉద్దేశపూర్వకంగా వ్యక్తిని బాల్ తో కొట్టి చంపలేదని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


Related News

Florida Woman Buried Husband: ‘దృశ్యం’ సినిమా లాంటి కేసు.. భర్త శవాన్ని ఇంట్లో పాతిపెట్టిన మహిళ.. హత్య మరెవరో చేసి..

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Big Stories

×