EPAPER
Kirrak Couples Episode 1

Coronavirus : వెయ్యికిపైగా జేఎన్.1 కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..

Coronavirus : దేశంలో కొవిడ్‌-19 సబ్ వేరియంట్ అయిన జేఎన్‌.1 కేసుల వ్యాప్తి వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 1,013 కేసులను నమోదు అయినట్లు వైద్యాధికారులు ప్రకటించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ జేఎన్-1 కేసు నమోదు అయినట్టు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు నమోదు అయిన కేసులను ప్రకటించింది.

Coronavirus : వెయ్యికిపైగా జేఎన్.1 కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..

Coronavirus : దేశంలో కొవిడ్‌-19 సబ్ వేరియంట్ జేఎన్‌.1 కేసుల వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 1,013 కేసులు నమోదు అయినట్లు కేంద్రం ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ కొత్తగా ఒక జేఎన్-1 కేసు నమోదు అయినట్టు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం ప్రకటించింది.


దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసులను ప్రకటించింది. కర్ణాటకలో అత్యధికంగా 214 కేసులు నమోదు అయినట్లు తెలిపింది. కేరళలో 154, మహారాష్ట్రలో 70, ఆంధ్రప్రదేశ్‌ లో 189, తమిళనాడులో 22, గుజరాత్‌ లో 76, గోవాలో 66, తెలంగాణ, రాజస్థాన్‌ ల్లో 32 చొప్పున, ఛత్తీస్‌గఢ్‌ లో 25, ఢిల్లీలో 16, ఉత్తర్‌ప్రదేశ్‌ లో 6, హర్యానాలో 5, ఒడిశాలో 3, పశ్చిమబంగాల్‌ లో 2, ఉత్తరాఖండ్‌లో ఒకటి చొప్పున కేసులు నమోదు అయ్యాయని వెల్లడించింది.

మరోవైపు దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. కొవిడ్-19 సబ్ వేరియంట్ అయిన జేఎన్-1 కేసులు నమోదు అవుతుడటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ వేరియంట్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది.


జేఎన్-1 వ్యాప్తివేగంగా విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే దీని ముప్పు తక్కువేనని స్పష్టం చేశారు. దేశంలో ఈ సబ్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ముందస్తు చర్యగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించింది. దేశవ్యాప్తంగా గురువారం ఒక్క రోజే 609 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,368గా ఉంది. జేఎన్‌.1 సబ్ వేరియంట్‌ను ప్రత్యేకమైన వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

Tags

Related News

Atishi Marlena Oath: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

RahulGandhi reacts: తిరుమల లడ్డూ వివాదం.. రాహుల్‌గాంధీ రియాక్ట్, నెయ్యిపై సీఎం సిద్దరామయ్య..

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Big Stories

×