Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలషెడ్యూల్ ఖరారైంది. జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు నిర్వహిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఈసారి సమావేశాలు తొలుత పార్లమెంట్ పాత భవనంలో మొదలవుతాయని ఇటీవల అధికార వర్గాలు ప్రకటించాయి.ఆ తర్వాత కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపాయి. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మే 28న పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్రం భావిస్తోంది. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే చాలా మంది పార్లమెంట్ సభ్యుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. ఈ బిల్లును కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మరికొన్ని పార్టీలు మద్దతు ఇచ్చే అవకాసం ఉంది. ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై బిల్లును ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. ఈ ఆర్డినెన్స్పై కేంద్రం, ఆప్ ప్రభుత్వం మధ్య వార్ నడుస్తోంది. ఆప్ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇవే చివరి వర్షాకాల సమావేశాలు కావడం ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా విపక్షాలు కలిసికట్టుగా పోరాడేందుకు సిద్ధమయ్యాయి. వివిధ అంశాల్లో కేంద్రాన్ని ప్రశ్నించేందుకు సన్నద్ధమవుతున్నాయి. మణిపుర్ ఘర్షణలపై చర్చకు విపక్షాలు పట్టబట్టే అవకాశం ఉంది.