PM Ujjwala Yojana Subsidy: సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.పేద , మధ్య తరగతి వర్గాలకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ పై అందిస్తున్న రూ. 300 సబ్సిడీని మరో ఏడాది పాటు పెంచింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 955గా ఉంది. ఈ స్కీమ్ లబ్ధిదారులకు రూ.300 సబ్సిడీ లభిస్తోంది. దీంతో వారు రూ. 655 కే గ్యాస్ సిలిండర్ పొందుతున్నారు. మార్చి నెలఖారుతో ఈ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏప్రిల్ నుంచి మరో ఏడాదిపాటు పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లపై రాయితీ ఇవ్వనుంది.
Read More: భారత్ ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతోంది.. ప్రపంచ వ్యాపారవేత్తలు ప్రశంసలు..
ప్రధాని మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 10 కోట్ల మంది లబ్ధిదారులు సబ్సిడీ పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారికి మరో ఏడాది ప్రయోజనం కలగనుంది.