MLC Kavitha Withdraws her WRIT Petition(Today latest news telugu) : ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు దాఖలు చేసిన రిట్ పిటిషన్ (writ petition)ను విత్ డ్రా చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే కవిత అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇక రిట్ పిటిషన్ పై విచారణ చేయాల్సిన అవసరం లేకపోవడంతో దానిని వెనక్కి తీసుకున్నట్లు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రిలీఫ్ పొందేందుకు చట్టప్రకారం తదుపరి స్టెప్ తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా.. రిట్ పిటిషన్ విత్ డ్రా కు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం అనుమతించింది. ఇక కవితను అరెస్ట చేయడం అక్రమంగా జరిగిందని దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది.
Also Read : ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
కాగా.. మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఖైదీగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ కవితను ఉద్దేశించి రాసిన లేఖ సంచలనమైంది. తీహార్ జైలుకు స్వాగతం అక్కా అంటూ సుకేశ్ లేఖ రాశాడు. విదేశాల్లో దాచిన సొమ్ముంతా ఈడీ విచారణలో బయటకు వస్తుందని, అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలోనే అరెస్ట్ అవుతారని ఆ లేఖలో పేర్కొన్నాడు సుకేశ్.