10 Killed in Mizoram Quarry Collapse: సెవెన్ సిస్టర్ స్టేట్ మిజోరంకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రెమల్ తుఫాన్ కారణంగా భారీ నష్టం వాటిల్లింది. దీని ప్రభావం రాజధాని ఐజ్వాల్లో రెట్టించిన విషాదాన్ని మిగిల్చింది.
తుఫాన్ నుంచి తేరుకోకముందే తాజాగా దక్షిణ ప్రాంతమైన మెల్తుమ్, హ్లిమెన్ల సరిహద్దులోని రాళ్ల క్వారీ కుప్పకూలింది. మంగళవారం ఉదయం ఆరుగంటల సమయంలో ఘటన జరిగింది. వర్షాల ధాటికి రాళ్ల క్వారీ ఒక్కసారిగా కుప్పకూలింది. గనిలో చిక్కుకున్న 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. మృతుల్లో ముగ్గురు వేరే రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు. మరికొందరు గనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్న మాట.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్య్కూ టీమ్లు అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. కొండ ప్రాంతం కావడంతో ఈ క్వారీ ఎఫెక్ట్ చుట్టుపక్కల ఇళ్లపై పడింది. దీంతో భారీగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: రంజిత్ సింగ్ హత్యకేసులో డేరా బాబాకు ఊరట.. నిర్దోషిగా తేల్చిన కోర్టు
ఘటన జరిగిన సమయంలో కార్మికులు ఎంత మంది ఉన్నారనేది గని నిర్వాహకులు చెప్పలేదు. శిధిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి. భారీగా వర్షాలు కురవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నమాట. దీనికితోడు కొండ చరియలు రెండురోజులుగా విరిగిపడుతున్నాయి. అయినా సరే నిర్వాహకులు రాళ్ల క్వారీలో పనులు కంటిన్యూ చేశారని అంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ప్రభుత్వం, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
#BREAKING :10 dead, several missing as stone quarry collapses in Mizoram's Aizawl amid heavy rainfall.#Mizoram #Aizawl #landslide pic.twitter.com/kVliFBdbdi
— upuknews (@upuknews1) May 28, 2024